ఛతీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్.. కానిస్టేబుల్ మృతి..!

-

ఛత్తీస్ గడ్  ని కాంకేర్ జిల్లాల్లో ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ఒక మావోయిస్టు మృతి చెందారు. జిల్లాలోని హిందూర్ అటవీ ప్రాంతంలోని చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు
జరిగాయి.

ఈ కాల్పుల్లో బస్తర్ ఫైటర్స్ యూనిట్ కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి చెందాడు. సంఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఏకే 47 తుపాకీని పోలీసులు కనుగొన్నారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, గత నెలలో బస్తర్ ప్రాంతంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఇద్దరు స్పెషల్ బెటాలియన్ కమాండోలు చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news