ఛత్తీస్ గడ్ : నారాయణ్ పూర్ లో ఎన్ కౌంటర్.. 7గురు మావోయిస్టులు మృతి

-

చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయినట్టు సమాచారం.

పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులను పోలీసులు మట్టుపెడుతున్నారు. ఇటీవలే కొంతమంది లొంగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news