అహ్మదాబాద్‌ టెస్టు.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 205 ఆలౌట్‌..

-

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ మళ్లీ విఫలం అయ్యారు. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు.

england 205 runs all out in their first innings at ahmedabad test

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో బెన్‌ స్టోక్స్‌ (55 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డాన్‌ లారెన్స్ (46 పరుగులు, 8 ఫోర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మళ్లీ విజృంభించాడు. 26 ఓవర్లు వేసిన అక్షర్‌ 68 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌ 19.5 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా సిరాజ్‌కు 2, వాషింగ్టన్‌ సుందర్‌కు 1 వికెట్‌ దక్కాయి. ఈ క్రమంలోనే మొత్తం 75.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 205 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారత స్పిన్నర్లు పింక్‌ బాల్‌ టెస్టు అనంతరం ఈ మ్యాచ్‌లోనూ రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news