PF అకౌంట్ ఉన్న వారికి ఈపీఎఫ్‌వో దీపావళి గిఫ్ట్..!

-

మీరు పీఎఫ్ వినియోగదారుల అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన కస్టమర్లకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఇక పీఎఫ్ అకౌంట్ కలిగిన కస్టమర్లకు మొదటి విడత 8.5 శాతం వడ్డీ రేటును వారి ఖాతాల్లో జమ చేసేందుకు సన్నద్ధం అయ్యింది. అంతేకాదు దీపావళి వరకు ఈ పీఎఫ్ డబ్బులపై వడ్డీ మొత్తం సబ్‌స్క్రైబర్ల అకౌంట్ ‌కు వచ్చి చేరుతుంది. ఇక పీఎఫ్ ఖాతా కలిగిన వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

epfo
epfo

అయితే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని 2020 డిసెంబర్ 31 నాటికి జమ చేస్తామని సెప్టెంబర్ నెలలోనే ప్రకటించింది సంస్థ. అయితే ఈ వడ్డీ రేటును రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇక తొలి విడత కింద 8.15 శాతం వడ్డీని, రెండో విడత కింద 0.35 శాతం మొత్తం లభిస్తుంది. అయితే ఈపీఎఫ్‌వో తొలి విడత 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళి కల్లా పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో జమచేయనుంది. ఇక మిగతా 0.35 శాతం వడ్డీ మొత్తం డిసెంబర్ చివరి కల్లా ఖాతాదారుల అకౌంట్లోకి వస్తుంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈపీఎఫ్‌వో రాబడి మార్చి నెలలో తీవ్రంగా దెబ్బతిన్న విషయం అందరికి తెలిసిందే. అయినా కూడా సెంట్రల్ బోర్డు 8.5 శాతం వడ్డీ చెల్లింపునకు మొగ్గు చూపింది.

అంతేకాదు ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు వడ్డీ రేట్ల తగ్గింపునకు ఒప్పుకోకపోవడం గమనార్హం. దీంతో పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ఊరట కలుగనుంది. ఇకపోతే పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ఈపీఎఫ్‌వో కరోనా వైరస్ కారణంగా సులభంగానే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news