నన్ను చూసి ఓటు వేయండి – ఈటల రాజేందర్‌

-

 

కాంగ్రెస్, BRS అభ్యర్థులను చూడండి.. నన్ను చూసి ఓటు వేయండని కోరారు ఈటల రాజేందర్‌. మన్సూరాబాద్ లో వివిధ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, సామ రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… దేశం క్షేమంగా ఉండాలని రామాలయం కట్టి, అక్షింతలు పంపించారన్నారు. జైశ్రీరామ్ అంటే అక్షింతలు పంచితే ఓట్లు పడతాయా అని కేసీఆర్ అంటున్నారు. ఎలా పడతాయి 13 వ తారీఖు చూడండని వెల్లడించారు.

Etala rajendhar

ఈ రోజు ఓట్ల కోసం మాట్లాడుతున్న కేసీఆర్ ను ఇది వెంటాడుతుంది….కాంగ్రెస్ అణగారిన వర్గాల పార్టీ అని చెప్పుకోవడమే తప్ప ఆచరణలో శూన్యం అని వివరించారు. సామాజిక న్యాయం చేసి చూపించిన పార్టీ బీజేపీ… రేవంత్ మీ మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత పాటించారా? మాటలకు చేతలకి పొంతన ఉందా? అని నిలదీశారు. మోదీగారి పదేళ్ల పాలనకు రెఫరండంలా ఓటు వేయమని అడుగుతున్నారు… ప్రతి ఒక్కరూ 13 వ తేదీ ఓటు వేయాలని కోరుతున్నానని ఈటల స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news