జోగిపేటలో ఉద్రిక్తతకు దారితీసిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర బర్త్ డే ర్యాలీ

-

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పుట్టినరోజు వేడుకలలో చేపట్టిన బైక్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టిఆర్ఎస్ – కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర గర్షణ చెలరేగింది. దామోదర రాజనర్సింహ పుట్టినరోజు సందర్భంగా జోగిపేట బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు.

అదే సమయంలో రేపు ఆందోల్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు అంటిస్తున్న క్రమంలో.. రాజనర్సింహ బర్త్డే ర్యాలీ అటువైపుగా వచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పోస్టర్లను చించి వేసి టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి బైక్ ని కూడా దగ్ధం చేశారు. దీంతో టిఆర్ఎస్ – కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర గర్జన చెలరేగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news