జగన్ తో మాజీ డీజీపీ భేటీ..

-

 

రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన భేటీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో  ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు శనివారం భేటీ అయ్యారు. విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ను అచ్చుతాపురంలో సాంబశివరావు కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో మాజీ డీజీపీ వైసీపీలో చేరుతున్నారని విజయసాయి రెడ్డి మీడియాకు తెలిపారు. భవిష్యత్ లో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని వివరించారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.

రాజకీయ ప్రాధాన్యత లేదు..  డీజీపీ

తాను వైసీపీలో చేరుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండిచారు. గంగవరం పోర్టు సీఈవో  హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్ను కలిశానని వెల్లడించారు. గతంలో సీపీగా పనిచేసినప్పుడు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని గుర్తుచేశారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. మా భేటీకీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news