వరద బాధితుల కోసం పాట పాడనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి!

-

వివిధ రకాల సమస్యల పరిష్కారాలు, చట్టాలతో  బీజీగా ఉండే న్యాయమూర్తులు పాటలు పాడటం ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ ఇది నిజం.. కేరళ వరదబాధితుల సహాయార్థం జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవలే నియమితులైన జస్టిస్ కేఎం జోసెఫ్ పాటలు పాడనున్నారు. సుప్రీం కోర్టు వార్తలను సేకరించే జర్నలిస్టులు ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సోమవారం నిర్వహించనున్న  ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జస్టిస్ జోసెఫ్ మొత్తం రెండు.. మలయాళ, హిందీ పాటలను ఆలపించనున్నారు.సర్వోన్నత న్యాయమూర్తి స్థానంలో  ఉన్న వారు బహిరంగ కార్యక్రమంలో పాటలు పాడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news