పూటుగా తాగి మరో ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన యజమాని..!

-

ఫుల్ గా తాగితే కొంతమంది సొంత ఇల్లు కూడా మర్చిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళాం… ఏం చేస్తున్నాం అన్నది అసలు ఆలోచించరు. అయితే సాధారణ వ్యక్తులు అలా వెళ్లడం కామన్ ఏ కానీ మాజీ ఎంపీ సైతం ఫుల్లుగా మద్యం సేవించి తన ఇంటికి కాకుండా మరొకరి ఇంటికి వెళ్ళాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Ex MP gopala krishnan beaten

తమిళనాడు లోని నీలగిరి లో మాజీ ఎంపీ గోపాలకృష్ణ దీపావళి పండుగ సందర్భంగా పూటుగా తాగి తన ఇంటికి వెళ్లకుండా మరో ఇంటికి వెళ్ళాడు. దాంతో ఆగ్రహించిన ఇంటి యజమాని మాజీ ఎంపీ పై దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని అరెస్టు చేశారు. అయితే గోపాల కృష్ణ అనుచితంగా ప్రవర్తించడం వల్లనే తాను దాడి చేశానని యజమాని పోలీసులకు తెలిపారు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ గోపాలకృష్ణ మాత్రం తనను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news