బండి సంజయ్ కి ఎర్రబెల్లి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి !

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్‌ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు పై ఒక స్పష్టమైన వైఖరిని తెలపాలని… పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు. రైతులను ఆందోళనకు గురిచేయడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటు అయిపోయిందని… ప్రజలు వాస్తవాలు తెలియాలని డిమాండ్‌ చేశారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల ప్రభుత్వామన్నారు. రైతే రాజు కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పని చేస్తున్నారని… దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం గారు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులతోనే తెలంగాణాలో పుష్కలంగా నీరు అంది, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, 24గంటల పాటు ఉచిత, నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ ని అందిస్తున్నారని… రైతుల కోసం రైతు వేదికలు, కల్లాలు కట్టించామని కొనియాడారు. రైతులు ఆత్మ గౌరవంతో, ఆత్మహత్యలకు తావు లేని విధంగా సీఎం గారు మొత్తం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news