సీయూఈటీ (యూజీ) అప్లికేషన్ల గడువు పొడిగింపు

-

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువు షెడ్యూల్‌ ప్రకారం నేటితో ముగియనుంది. తాజాగా అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు మార్చి 31 రాత్రి 9.50గంటల వరకు అభ్యర్థులు https://exams.nta.ac.in/CUET-UG/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్‌ ప్రొ. జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్‌ చేశారు.

ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ యూజీ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో జరగనుంది.జూన్‌ 30న రిజల్ట్స్ ను విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news