కోయంబత్తూరులో దారుణం.. వ్యక్తిని చంపి 12 ముక్కలు చేసి..

-

తమిళవాడులోని కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చంపి 12 ముక్కులు చేసి వేర్వేరు చోట పడేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. మృతుడికి మహిళకు గతంలో వివాహేతర సంబంధం ఉండేదని తర్వాత అది శత్రుత్వంగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు కారణం అదేనని పోలీసులు వెల్లడించారు.

 

గత గురువారం తుడియాలూర్ సమీపంలోని వెళ్లకినార్​లోని ఓ చెత్త కుండీ వద్ద ఒక చెయ్యి కనిపించింది. పోలీసులు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో.. ప్రభు(39) అనే వ్యక్తి కనిపించడం లేదన్న కేసు నమోదైంది. రెండింటినీ కలిపి చూడగా.. అసలు విషయం బయటపడింది.

ప్రభుకు పెళ్లయింది. అయితే.. బ్యూటీ పార్లర్ నడిపే ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉండేది. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. తెలిసిన ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఆ మహిళ.. ప్రభును దారుణంగా హత్య చేసింది. శరీరాన్ని ముక్కలు చేసి, నగరంలో అక్కడక్కడ పడేసింది. ఇప్పటివరకు 8 శరీర భాగాలు లభ్యమయ్యాయని, ముగ్గుర్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news