జగన్ సొంత జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్…!

-

ఏపీ సీఎం సొంత జిల్లాలో ఫాక్షన్ భూతం పడగ విప్పింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కక్షలకు ఒకరు బలయ్యారు. కొండాపురం మండలం బి.అనంతపురం గ్రామంలో ముంపు పరిహారం చెల్లింపుపై సర్వే జరుగుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య విభేధాలు తలెత్తాయి. అవి కాస్తా కత్తులు, కట్టెలతో దాడులు చేసుకునే దాకా వెళ్లాయి.

 

murder
murder

గురు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థి వర్గం కత్తితో పొడిచింది. అతణ్ని వెంటనే తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో ప్రతాప్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుడు. ఈ హత్య ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎక్కడిక్కడ పికెట్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news