Youtubeలో చూసి ఫేక్ కరెన్సీ ప్రింటింగ్.. అన్నాచెల్లెళ్లు అరెస్ట్

-

నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను సౌత్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన రమేశ్​బాబు కార్ మెకానిక్​గా పనిచేస్తుండేవాడు. లాక్​డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో అతడి సోదరి రామేశ్వరితో కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని నకిలీ నోట్ల ప్రింటింగ్​ స్టార్ట్ చేశారు. యూట్యూబ్​లో చూసి ఫేక్ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేస్తూ 2022లో గోపాలపురం పోలీసులకు చిక్కారు.

రమేశ్ బాబు జైల్లో ఉండగా.. రామేశ్వరి బెయిల్​పై బయటకు వచ్చింది. జైల్లో ఉన్న రమేశ్ బాబు.. హత్యకేసులో జైలుకు వచ్చిన హసన్ బిన్​తో పరిచయం పెంచుకుని ఫేక్ నోట్ల ప్రింటింగ్ గురించి చర్చించాడు. ఇద్దరూ కలిసి జైల్లోనే ప్లాన్ వేసుకున్నారు. బయటకు రాగానే రమేశ్ బాబు తన కుటుంబాన్ని తాండూర్​కు తరలించి.. రూ.500 ఫేక్ నోట్లు తయారు చేసి గుజరాత్​కు వెళ్లి అక్కడ చలామణీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.

తన సోదరుడు పోలీసులకు దొరికిపోవడంతో హసన్​బిన్ గురించి తెలుసుకున్న రామేశ్వరి అతడిని సంప్రదించి చాంద్రాయణగుట్టలో ఫేక్ నోట్ల చలామణీ ప్రారంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హసన్​బిన్​తోపాటు రామేశ్వరని అరెస్టు చేసి రూ.27 లక్షల నకిలీ నోట్లు, ప్రింటర్, ల్యాప్​టాప్ స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news