పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర..!

-

మీరు బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా బంగారం రేటు దిగొచ్చింది. అదే విధంగా వెండి కూడా పయనించింది. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే..

హైదరాబాద్ మార్కెట్‌లో సోమ వారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ.47,990కు చేరింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గుదలతో రూ.43,990కు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.21 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1772 డాలర్లకు ఎగసింది.

ఇక వెండి గురించి చూస్తుంట… వెండి రేటు ఏకంగా రూ.900 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.73,100కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 25.99 డాలర్లకు చేరింది.

ఇది ఇలా ఉంటే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైనవి పసిడి రేటుపై ప్రభావం చూపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news