అయ్య బాబోయ్.. చెప్పులు కోసం పోలీసులకు చెమటలు పట్టించాడుగా..

-

 

పోలీసులకు రోజుకు ఎన్నో కేసులు వస్తాయి.. వాటిని పరిష్కరించాలి.. అవి పూర్తీ కాక ముందే మళ్ళీ కేసులు వచ్చి పడతాయి..అలాంటి పోలీసులకు చెమటలు పట్టేలా చేశాడు ఓ వ్యక్తి..180 రూపాయలు పెట్టి ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు పోయాయని ఫిర్యాధు చేయడానికి పోలీసుల గడప తొక్కాడు.మొదట అతడు చెప్పిన మాటలు విని పోలీసులతో పాటుగా, అక్కడకు వచ్చిన జనాలు కూడా పగలబడి నవ్వారు. ఆ తర్వాత అతను చెప్పిన విషయాల దృష్ట్యా కేసును స్వీకరించారు.ఇప్పుడు ఇది సంచలంగా మారింది.

ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది.అయితే మొదట్లో రైతు చెప్పిన మాటలు విన్న కొందరు పోలీసులు నవ్వుకున్నారు. చెప్పుల గురించి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అని ఆ రైతుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.కానీ అతను మాత్రం వారి బుజ్జగింపులకు మాత్రం లొంగలేదు.తిరిగి అతనే ఒక పెద్ద స్టోరీ చెప్పాడు..

విషయానికొస్తే.. ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. తన చెప్పుల చోరీ వెనుక కుట్ర ఉందని జితేంద్ర పోలీసులకు తెలిపాడు. “దొంగ నా చెప్పులను మరొక నేర స్థలంలో వదిలేస్తే ఆ నేరం రైతు అయిన నాపై పడుతుంది, ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని” రైతు జితేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర. అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు సేకరించి, త్వరలో చెప్పులను వెతికి ఇస్తామని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news