వాహనదారులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. ఇక పై 3000 చెల్లిస్తే

-

దేశంలోని వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. ఇకపై 3000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు.. వేసుకోవచ్చు అని తాజాగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ హైవే లపై ప్రయాణం విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3000 రూపాయలు చెల్లించి… ఫాస్ట్ ట్రాక్ బేసిడ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో ఇండియా వ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైన 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని… కేంద్రం ప్రకటన చేసింది.

FASTag-based Annual Pass priced at 3000 rupees effective from 15th August Nitin Gadkari
FASTag-based Annual Pass priced at 3000 rupees effective from 15th August Nitin Gadkari

ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్…. గడ్కరి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనను మొన్న ఢిల్లీ ఎలక్షన్ కంటే ముందు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు అమల్లోకి తీసుకు వస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు… 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి. రామ్ రాజ్ యాత్ర యాప్ నుంచి ఈ పాస్ కూడా తీసుకోవచ్చని… క్లారిటీ ఇచ్చారు. దీంతో ఢిల్లీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news