ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం!

-

ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి లో దారుణం చోటుచేసుకుంది.కన్న తండ్రి తన ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా అదమ్ షఫీ బొప్పూడి లో ఉంటూ చిలకలూరిపేట లోని కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న తినుబండారాల దుకాణంలో పనిచేస్తున్నాడు.కుమార్తె ఓ పాఠశాలలో చదువుతుంది.స్కూలుకు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేయించేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని..రాత్రిపూట నాన్న పక్కన పడుకో పెట్టొద్దని ఏడుస్తూ చెప్పింది.సరేనంటూ తల్లి ఓదార్చింది.ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన నిద్రపోతుంటారు. చిన్నారి చెప్పిన విషయం తో తల్లి హుస్సేన్ బి ఆలోచనలో పడింది.భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..?అనే సందేహం వచ్చింది.

ఇలా ఓ వారం గడిచాక..భర్త చేసే పనులు గమనించింది.భార్య నిద్ర పోతుందా లేదా..?అని సెల్ ఫోన్ లైట్ వేసి చూశాడు.నిద్ర పోతుంది అని గుర్తించి వెంటనే దారుణానికి సిద్ధమయ్యాడు.కుమార్తె పక్కన పడుకొని సెల్ ఫోన్ ఆన్ చేసి అందులో నీలి చిత్రాలు చూస్తూ నిద్రిస్తున్న తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.గమనించిన భార్య హుస్సేన్ బి వెంటనే భర్త ని పట్టుకుంది.ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్త లాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని రోదిస్తూ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.పోలీసులకు ఫిర్యాదు చేసింది.చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.చిన్నారిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news