నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

-

చిన్నపిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. ముఖ్యంగా అప్పుడప్పుడే నడక, మాటలు నేర్చుకుంటున్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వాళ్ల మాటలు, బుడిబుడి అడుగులు, వాళ్లేం చేసినా ముద్దుగా అనిపిస్తుంది. కానీ ఓ తండ్రి మాత్రం ఇదంతా న్యూసెన్స్ గా భావించాడు. నిద్ర పోతున్నప్పుడు తన నిద్రకు భంగం కలిగిస్తున్నాడనే కోపంతో ఏడాదిన్నర వయసున్న కన్నకొడుకును చంపేశాడు. ఈ దారుణ ఘటన హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది.

రక్షాబంధన్​ సందర్భంగా ఆ పసివాడి తల్లి.. తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మహిళకు ఇద్దరు కుమారులు కాగా.. ఓ కుమారుడిని తనతో తీసుకెళ్లింది. మరో కుమారుడిని తండ్రి వద్దే ఉంచి వెళ్లింది. నిందితుడు రాత్రి సమయంలో విధులు నిర్వర్తించి.. ఉదయాన్నే పడుకుంటాడు. ఈ క్రమంలోనే తండ్రి నిద్రపోతుండగా.. ఏడాదిన్నర చిన్నారి ఏడుస్తున్నాడు.

నిద్రకు డిస్టర్బెన్స్ గా మారాడని కోపోద్రిక్తుడైన తండ్రి ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి అచేతన స్థితిలో కనిపించాడు. దగ్గరికి వెళ్లి చూస్తే అప్పటికే ఆ పసివాడి ఊపిరి ఆగిపోయింది.

ఉదయం 9.30గంటల సమయంలో చిన్నారి ఏడుపులు వినిపించాయని.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆగిపోయాయని స్థానికులు చెప్పారు. కానీ అతడి తండ్రే ఇలాంటి చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నారి మృతి చెందడం వల్ల భయపడిన నిందితుడు.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ పసివాడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news