రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే – షబ్బీర్ అలీ

-

కామారెడ్డి : రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.దోమ కొండ మండలం గడికోట నుంచి ఆజాద్ కి గౌరవ యాత్ర ప్రారంభించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జాతీయ జెండాల తో పాదయాత్ర 7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన షబ్బీర్ అలీ,పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. దేశంలో ద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఐక్యత ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర అని పేర్కొన్నారు షబ్బీర్ అలీ.

ఈ ప్రభుత్వం ధరల పెరుగుదల మరియు అణచివేత వంటి సమకాలీన సమస్యలను కూడా మేము లేవనెత్తుతామని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ భాగస్వామ్యానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు జాతీయవాదన్ని మతతత్వాన్ని బీజేపీ వాడుకుంటుందని… జాతీయవాదం మరియు భద్రతపై బిజెపి ప్రచారం వల్ల తమ రాజకీయ పబ్బం గడుపుతుందని పేర్కొన్నారు.

బిజెపికి వ్యతిరేక పవనాలు వీచినప్పుడల్లా మతాల మధ్య ప్రజల మధ్య చిచ్చుపెదుతుందన్నారు. కర్ణాటకలో హిజాబ్ మరియు హలాల్ మాంసంపై కఠినచర్యలు NRC. CAA వంటి “జాతీయవాదం” యొక్క సంస్కరణలు తీసుకువచ్చి లబ్ధి పొంది ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. వెన్నుపోటు పొడిచే ద్రవ్యోల్బణం, భయంకరమైన నిరుద్యోగం ఉందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news