28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ

-

ఉత్తర్‌ ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అసలేం జరిగిందంటే..?

గోరఖ్‌పుర్‌ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్‌ గ్రామంలో కైలాశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం కాగా, అందరూ వివాహాలు చేసుకొని వేరు కాపురాలు పెట్టారు. కొన్నేళ్ల క్రితం కైలాశ్‌ మూడో కుమారుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగా మిగిలింది.

ఇటీవలే కైలాశ్‌ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పూజ నుదుట కైలాశ్‌ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ సంగతి తెలిసిందా ఆ గ్రామస్థులంతా ఆశ్చర్యపోయారు. ఇదేం పిచ్చంటూ మాట్లాడుకుంటున్నారు. కోడల్ని పెళ్లి చేసుకోవడమేంటి.. ఒంటరిగా ఉందని బాధపడితే ఇంకో పెళ్లి చేయాలని కానీ అని చీవాట్లు పెడుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి యూపీలో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news