బ్రేకింగ్: ఇద్దరు కూతుళ్ళ గొంతు కోసిన తండ్రి, తెలంగాణాలో దారుణం…!

-

తెలంగాణాలో దారుణం జరిగింది. కాపాడాల్సిన తండ్రి ఇద్దరు పిల్లల గొంతు కోసాడు. సిద్ధిపేట జిల్లా… దుబ్బాక మండలం చిత్తాపూర్ లో దారుణం జరిగింది. తన ఇద్దరు కూతుళ్ళ గొంతుని తండ్రి కోయడంతో ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారు ఇద్దరినీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

 

అయితే ఈ ఘటన వెనుక కారణాలు ఏంటీ అనేది వెల్లడి కాలేదు. ఈ ఘటనకు ముందు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా…? అతను మద్యానికి బానిస అయి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version