అంధుల పాఠశాలలో ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది దుర్మరణం

-

ఉగాండాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముకోనో జిల్లాలోని ఓ అంధుల పాఠశాలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో చిన్నారులు కూడా మృతి చెందారని పోలీసులు తెలిపారు. మొత్తం 11 మంది అగ్నికి ఆహుతయ్యారని వెల్లడించారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

గతంలోనూ ఇదే మాదిరి ఉగాండా రాజధాని కంపాలా సమీపంలోని పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని స్థానిక వార్తా మీడియా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news