విద్యుత్ శాఖ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం..

-

తెలుగు రాష్ట్రాలని వరుస అగ్ని ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ముందుగా ఏపీలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది మరణించగా మొన్న తెలంగాణా వాటాకు వచ్చే శ్రీశైలం జల విధ్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి తొమ్మిది మంది మరణించారు. దీంతో అగ్నిప్రమాదాలు అంటేనే వణుకు పుడుతోంది జనానికి.

తాజాగా కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలోని స్టార్ రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. ఆఫీస్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలెనే చోటు చేసుకుందా లేక మరే కారణం అయినా ఉందా అనేది ఇంకా తేలలేదు. ఈ విషయం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news