హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం !

-

తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న విజయవాడ కోవిడ్ సెంటర్ లో ప్రమాదం జరిగి పది మంది మరణించగా ఆ తర్వాత కూడా కరోనా సెంటర్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గౌలిగూడ కోటబస్తీ లక్ష్మీ టెక్స్ టైల్ లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే విషయం తెలియరాలేదు.

షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్ని మాపక వాహనాలు ఇప్పుడు మంటలు ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇక గత వారంలో హైదరాబాద్ శివారులోని ఒక గో డౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి కోట్ల రూపాయల నష్టం చేకూరింది. సాల్వెంట్స్ నిలవ చేసే ఆ గోడౌన్ లో సరయిన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news