చెన్నైలో కాల్పుల కలకలం.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి !

-

తమిళనాడు రాజధాని చెన్నైలో కాల్పుల కలకలం రేగింది. దుండగులు గన్ తో ఏకంగా ముగ్గురిని కాల్చి చంపారు. ముగ్గురి మీద కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నైలోని షావుకారు పేట లో నివాసం ఉంటున్న దలీల్‌ చందు కుటుంబం మీద ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. కుటుంబ తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎలిఫెంట్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీపీ మహేష్ కుమార్ అగర్వాల్ కూడా పరిశీలించారు. ఈయన ఫైనాన్స్‌ వ్యాపారి అని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన భార్య కుషాల్‌ భాయి(70) కుమారుడు సీతల్‌ (38)ని కాల్చి చంపారు పోలీసులు. కుటుంబ తగాదాలు అని భావిస్తోన్నా ఈయన చేసేది ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఒక వేళ మరేదన్నా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news