భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు..!

-

ప్రస్తుతం మంకీ పాక్స్ వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపింది. తాజాగా భారత్ లోకి కూడా ప్రవేశించింది. భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా ఢిల్లీలో ఒకరికీ మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడినీ వైద్యులు పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆ బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news