చేపలకోసం పోటెత్తిన జనం.. ఇవాళ తింటే మంచిదా?

-

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ రోజు చేపల మార్కెట్ బాట పట్టారు. చేపలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఆదివారం గడిచి ఒక్క రోజు అయింది. ఇలా ఎందుకు మార్కెట్‌కు పోటెత్తారని అనుకుంటున్నారా. ఇక్కడే విశేషముంది.

ఇవాళ ‘మృగశిర కార్తె’. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు భావిస్తారు. అందుకే ఈ రోజు చేపలు తింటారు. 27 నక్షత్రాల్లోకి ఈ రోజు సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘మృగశిర కార్తె’గా పిలుచుకుంటారు. అంతేకాదు ఈ కార్తె ప్రారంభంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నిన్నటితో రోహిణీ కార్తె ముగిసింది. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభంకావడంతో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రైతులు ఏరువాక లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగళ్లతో పొలాలను దున్ని పంటలు వేస్తారు.

ఈ కార్తె సందర్భంగా చేపలు తినడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వేసవి కాలం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. వేడిగా ఉండే చేపలను తింటారు. ఇలా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, అస్తమా వంటి రోగాలు నయం అవుతాయని నమ్మకం. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలు కూడా తగ్గుతాయని అంటారు. అందుకే మృగశిర కార్తె రాగానే ప్రజలందరూ చేపలు తినేందుకు మరింత ఆసక్తి చూపుతారు.

ఈ రోజు మృగశిర కార్తె కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రామ్ నగర్ చేపల మార్కెట్ అయితే తెల్లవారుజాము నుంచే ప్రజలు బారులు తీరారు. ఎలాగైనా సరే ఈ రోజు చేపలు కొని తినాలని అంటున్నారు. అయితే ఇలా మార్కెట్‌లో రద్దీ ఉండటంతో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కరోనా బారిన పడతారని హెచ్చరిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news