జువెనైల్​ హోమ్​లో అరాచకం.. తోటి ఖైదీలపై ఐదుగురు గ్యాంగ్ రేప్

-

మధ్యప్రదేశ్​ జైపుర్​లోని జువెనైల్ హోమ్​లో దారుణం జరిగింది. ట్రాన్స్​పోర్ట్​నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని జువెనైల్​ హోమ్​లో ఉంటున్న ఐదుగురు ఖైదీలు.. తోటి ఖైదీలపై దాడి చేశారు. అసహజ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డారు. జువెనైల్​ హోమ్​లో ఉంటున్న ఖైదీ నంబర్​ 256 రాత్రి తన గదిలో నిద్రపోతున్నాడు. అదే సమయంలో ఐదుగురు వ్యక్తులు గదిలోకి ప్రవేశించి ఖైదీ నంబర్​ 256ను బంధించి ప్యాంట్​ను​ చింపేశారు. అనంతరం అతనిపై వికృత చర్యకు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జైలు అధికారుల దృష్టికి ఈ విషయం చేరడంతో మరో ఖైదీ నంబర్ కూడా కొద్ది రోజులుగా ఆ ఐదుగురు తనపైన పలుమార్లు దాడి చేసి అత్యాచారం చేశారని చెప్పాడు. బాధితులు ఇద్దరు అల్వార్​ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.

“జువెనైల్​ హోమ్​లో ఉంటున్న 18, 24 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఖైదీలపై, అక్కడే ఉంటున్న 17 నుంచి 20 సంవత్సరాల వయస్సు ఉన్న ఐదుగురు ఖైదీలు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై హత్య, అత్యాచారం కింద కేసులు నమోదు చేశాం. విచారణ జరుగుతోంది” అని ఆదర్శనగర్ ఏసీపీ హవాసింగ్​ తెలిపారు.

ఇక్కడి చిల్ట్రన్ కరెక్షన్ హోమ్​లో రెండు కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒకదాంట్లో జువెనైల్ హోమ్ ఉందని, 18 ఏళ్ల లోపు చిన్నారులు ఇందులో ఉంటారని, మరో కేంద్రంలో 18 ఏళ్ల పైబడినవారు ఉంటారని వెల్లడించారు. రెండు కేంద్రాలు ఒకే భవంలో ఉండటం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news