హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు

-

బాల రాముడి దర్శనానికి వెళ్తే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.

విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు పేర్కొన్నారు.ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళ, గురు, శనివారం) స్పైస్ జెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఉదయం 10:00 గంటలకు బయల్దేరి 12:45కు అయోధ్యకు చేరుకుంటాయి. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 01:25కి బయలుదేరుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news