కేంద్రమంత్రి అమిత్ షా తో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. అరగంట పాటు వీరు ఇరువురి మధ్య సమావేశం జరిగింది. జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా నివాసంలో సమావేశమయ్యారు పార్టీ ముఖ్య నేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్.

శుక్రవారం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో చేరిన తర్వాత పార్టీ ముఖ్యులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జేపీ నడ్డాను కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి. నేడు అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా, నడ్డా నివాసానికే రావాల్సిందిగా సూచించారు అమిత్ షా. దీంతో ఒకేసారి అమిత్ షా, బీఎల్ సంతోష్ , జేపీ నడ్డా సహా పలువురు పార్టీ ముఖ్యులను కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news