ఆ మాజీ సీఎంకు కరోనా..!

-

కరోనా వైరస్ భారత్ పై తన పంజా విసురుతుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి భారిన కొన్ని లక్షల మంది పడగా.. కొన్ని వేల మంది దీని కారణంగా మరణించారు. ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను, ప్రముఖలను.. ఇలా ఎవరిని వదలకుండా అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఇప్పటికే దీని బారిన చాలా మంది రాజకీయ నేతలు పడ్డారు..

 

కాగా, తాజాగా గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ జరిగింది. 4 రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో భాదపడుతున్నారు. దీంతో నిన్న సాయంత్రం ఆయనకి కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అనంతరం ఫలితాల్లో ఆయనికి వైరస్ సోకిందని తేలింది. ఇక వెంటనే శంకర్ సింగ్‌ను గాంధీనగర్‌ లో తన ఇంటిలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news