కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి నేనే వెళ్లమన్నా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌, బోడుప్పల్‌కు చెందిన కార్పొరేటర్‌లను తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమని చెప్పినట్లు ఆయన మీడియా ఎదుట వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనానికి దారి తీసింది. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్కు కోవర్టులుగా పని చేయాలని ఆదేశించినట్లు .. వారు కాంగ్రెస్‌లో చేరినా.. బీఆర్ఎస్ పార్టీకే పని చేస్తున్నట్లు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు. పాత కాంగ్రెస్‌ నాయకులతో తమకు పొసగడంలేదని.. తిరిగి  బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెబుతున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సైతం సమర్థించడం ఒకింత ఊతమిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news