AP Cabinet : సీఎం జగన్‌ పై మాజీ మంత్రి బాలినేని తిరుగుబాటు !

-

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త కేబినేట్‌ ఫైనల్‌ అయింది. ఎన్నో సమీకరణాలు, ఇంకెన్నో కూడికలు, ఎన్నో తీసివేతల మధ్య ఏపీ నూతన కేబినేట్‌ కూర్పు ఫైనల్‌ అయిపోయింది. మొత్తం 25 మందిని కొత్త కేబినేట్‌ లోకి తీసుకున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే… మంత్రి వర్గంలో చోటు దక్కకపోవటంతో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ కు కొనసాగింపు ఇచ్చి తనను మాజీని చేయటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బాలినేని శ్రీనివాస్‌. తనకు మంత్రి పదవి రాకపోవడం ఏంటని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… బుజ్జగించటానికి రెండో దఫా బాలినేని నివాసానికి వెళ్లిన సజ్జల రామకృష్ణా.. నిన్న సాయంత్రం ఒకసారి వెళ్ళి పదిహేను నిమిషాల్లో వెనుతిరిగారు.

రాత్రి 8 గంటల ప్రాంతంలో మరో సారి బాలినేని నివాసానికి వెళ్లిన సజ్జల… గంట సేపు బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ బాలినేని మాత్రం అలక వీడటం లేదు. 11 మంది పాత మంత్రులకు కొనసాగింపు ఇచ్చి బాలినేనిని పక్కకు పెట్టడం అవమానించటమే అంటుంది ఆయన వర్గం. త్వరలోనే దీనిపై బాలినేని స్పందించనున్నట్లు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news