బీజేపీకి మాజీ మంత్రి గుడ్ బై..?

-

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. మహారాష్ట్రలో బిజెపి సీనియర్ నేత మాజీ మంత్రి గా ఉన్న ఏక్నాథ్ ఖడ్సే ఇటీవల బీజేపీ కి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారిపోయింది. బీజేపీకి గుడ్బై చెప్పి ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఏక్నాథ్. ఈ విషయాన్ని ఏకంగా ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. మరింత మంది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎన్సిపి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ చేరికతో మహారాష్ట్రలో ఎన్సీపీ మరింత బలంగా మారుతుంది అంటూ వ్యాఖ్యానించిన జయంత్… మరింత మంది బీజేపీ నేతలు కూడా ఎన్సిపి లోకి రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఉన్నపలంగా బిజెపి సీనియర్ నేత మాజీ మంత్రి అయినా ఏకనాథ్ బిజెపి పార్టీకి గుడ్బై చెప్పి ఎన్సిపి పార్టీలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news