మరో రెండు రోజుల్లో వైసీపీ లోకి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ..?

-

మరికొన్ని రోజులలో ఎన్నికలు సమీపిస్తుండడంతో  టీడీపీ, జనసేన పొత్తుల వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. పొత్తుల వ్యవహారంతో ఒక పార్టీకి సీటు వస్తే ఇంకో పార్టీ పై వేటు పడాల్సి వస్తుంది.  విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నుంచి గెలవాలంటే మైనార్టీలకు సీటు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జలీన్ ఖాన్ డిమాండ్ చేశారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి  పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్తుందనే ప్రచారం జరుగుతుండడంతో  జలీల్ ఖాన్ వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో  వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని  ఆయన కలవడంతో టిడిపి నాయకులు అలెర్ట్ అయ్యారు. టీడీపీ నేత కేశినేని చిన్ని జలీల్‌ఖాన్‌ను కలిసి, వైసీపీ  న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ గెలవాలనే పట్టుదల మాటల్లో కాదని చేతల్లో ఉండాలని టీడీపీ, జనసేనకు చురకలు అంటించారు.విజయవాడ పశ్చిమలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని.. ఒక వేళ టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news