టీడీపీలో తీవ్ర విషాదం..మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

-

కోనసీమ జిల్లా : టీడీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రి కి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. 2014 లో టీడీపీ పార్టీ తరఫున పి.గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి. 2019లో టీడీపీ పార్టీ టికెట్ నిరాకరణించారు. 2019 ఎన్నికలలో టికెట్ నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి… వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల చంద్రబాబుని కలవడానికి ప్రయత్నించారు పులపర్తి. కానీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ను కలిసేందుకు నిరాకరించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news