కర్ణాటకలో నలుగురు హైదరాబాద్ యువకులు మృతి

-

కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఆదివారం ఈతకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు మరణించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్లోని బోరబండ కు చెందిన కొన్ని కుటుంబం బీదర్ జిల్లా గొడవాడి గ్రామంలోని హజరత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గా దర్శించుకునేందుకు వెళ్ళింది.

హజరత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గా ని దర్శించుకున్న అనంతరం సమీపంలోని చెరువు లో ఈత కు.. వెళ్లారు ఆ కుటుంబంలోని నలుగురు యువకులు. అయితే… దురదృష్టవశాత్తు ఆ నలుగురు యువకులు… ఈత రాకపోవడంతో చెరువులోనే మృతి చెందారు.

వారిలో నలుగురు యువకులు దగ్గరలోని… చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఈ నేపథ్యంలో లోతు సరిగ్గా అంచనా వేయలేకపోయారు ఆ నలుగురు యువకులు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి.. నీటిలో మునగ గా… అతన్ని కాపాడేందుకు మిగతా ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వీరికి కూడా ఈత రాకపోవడంతో నలుగురు మృతి చెందారు. తెలుగు లో మృతి చెందిన వారిని సయ్యద్ ఉస్మాన్, మహమ్మద్ జునైద్ ఖాన్, మహమ్మద్ అలీ ఖాన్, సయ్యద్ సయ్యద్ ఖలీద్ గా గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండ లో విషాదం నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news