అన్నారం పంప్‌హౌస్‌లో నాలుగో పంప్ పునఃప్రారంభం

-

కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం పంప్ హౌస్ లో నాలుగో పంప్ కూడా పున:ప్రారంభమైంది. ఇటీవలి గోదావరి వరదల్లో అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్​లు నీట మునిగిన సంగతి తెలిసిందే. గుత్తేదారు ఖర్చుతోనే పంప్ హౌస్​లను పునరుద్ధరిస్తున్నారు. పంపులకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే మూడు పంపులను పున:ప్రారంభించారు.

తాజాగా సోమవారం రాత్రి నాలుగో పంపు కూడా పున:ప్రారంభమైంది. పంపు పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగతా పంపులను కూడా దశల వారీగా పునరుద్దరిస్తామని, కన్నేపల్లి పంప్ హౌస్​లోనూ త్వరలోనే పంపులను ప్రారంభిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news