భీమ్లా నాయక్ నుంచి మరో బిగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతారామ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమా రిలీజవుతోంది. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే కిరణ్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీజర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగవ సింగిల్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అడవితల్లి మాట అంటూ సాగే ఈ గీతాన్ని విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ మేరకు పవన్ కళ్యాణ్, రానా ల పోస్టర్ ను విడుదల చేసింది. ఇంకా ఈ అప్ డేట్ తో పవన్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news