తెరాస అధినేతపై పోటీచేసే అభ్యర్థికి తీవ్ర అస్వస్థత

-

తెరాస అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నటుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఈఆర్వో కార్యాలయం ఎదుట వంటేరు దీక్షకు దిగారు. అయితే దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.  సొంత పూచీ కత్తుగా విడిచిపెట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీగా తీసుకొస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి అదుపుతప్పడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

వంటేరు ప్రతాప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత వంటేరు ఆరోగ్యం కాస్త కుదట పడటంతో ఆయన్ను డిజార్జ్ చేశారు. తనకు తెరాస ప్రభుత్వం అనేక రకాలుగా వేదిస్తోంది అంటూ ఆయన పలు మార్లు ఆరోపణలు చేసిన నేపథ్యంలో గజ్వేల్ లో గందరగోళం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news