బ్రేకింగ్‌ : గాంధీ ఆస్పత్రి రేప్‌ కేసులో మహిళ అచూకీ లభ్యం

-

గాంధీ ఆస్పత్రి రేప్‌ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో తాజాగా పురోగతి లభించింది. గాంధీ ఆసుపత్రి లో ఏడు రోజుల నుండి కనిపించకుండా పోయిన మహిళ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 11 వ తేదీ మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది తిరుపతమ్మ అనే మహిళ.

తిరుపతమ్మ చెల్లెలు ఫిర్యాదు తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు… ఈ మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు ఏకంగా పది టీమ్ దర్యాప్తు బృందాలు రంగం లోకి దిగాయి. అయితే.. చివరకు క్షేమముగా ఆ మహిళను పోలీసులు గుర్తించారు. ఏడు రోజులుగా మహిళ ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో ఉన్నది అనే దాని పై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.  ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అత్యాచారం చేసినట్లుగా  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ మహేశ్వర్ తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పోలీసుల అదుపు లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news