భర్త పక్కనే ఉండగా… భార్యపై అత్యాచారం

-

రాజస్థాన్‌ రాష్ట్రంలో దారుణ సంఘటన వెలుగు చూసింది. భర్తను చితకబాది.. అతని భార్య పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బాడ్మెర్‌ కు చెందిన దంపతులు బైక్‌ పై గత మంగళవారం బలోత్రాకు బయలు దేరారు. ఈ నేపథ్యం లో మార్గ మధ్యలో నలుగురు వ్యక్తులు దంపతుల బైక్‌ ను అడ్డుకుని వారిపై దాడికి దిగారు.

భర్తను తీవ్రంగా కొట్టి.. తర్వాత.. వారిని బలవంతంగా కారులో ఎక్కించి.. భార్యపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం భార్యభర్తలను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. దీంతో భార్యభర్తలు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే… ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాడ్మెర్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించిన అనంతరం కోర్టులో హాజరుపర్చ నున్నట్లు పోలీసులు వెల్లడించారు.అయితే.. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news