విజయవాడలో గదిలో బంధించి మహిళపై గ్యాంగ్ రేప్​

-

ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అనారోగ్యం పాలవగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నగరంలోని బెంజి సర్కిల్‌ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news