రికార్డు స్థాయిలో 1010 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు…

-

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుండి ఉత్తరప్రదేశ్,ఒడిశా రాష్ట్రాలకి అక్రమంగా కంటైనర్ లో గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాని ఎల్ బి నగర్ జోన్ ఎస్ ఓ టి అలానే అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు నిందితులు మొహ్మద్ రంజాన్ మరియు గౌతమ్ రావు లుగా గుర్తించారు. పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్టు పేర్కొన్నారు పోలీసులు.

నిందితుల వద్ద నుండి రికార్డ్ స్థాయిలో కోటి ముప్పై లక్షల విలువైన1010 కేజీల గంజాయి, ఒక కంటైనర్, 4000 నగదు మరియు 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ ఆన్ లాక్ అయిన తరువాత వాహనాలు మొదలయ్యాయని, ఇలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు వచ్చిన సమాచారంతో 1010 కిలో గంజాయి కంటైనర్ లో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ సీట్ వెనుక భాగంలో సీక్రెట్ గా ఈ గంజాయి ని తరలిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ పట్నం ఏజెన్సీ నుండి ఉత్త ప్రదేశ్ , హరియనాకు గంజాయి ను సప్లై చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news