గన్నవరం ఎయిర్ పోర్ట్ లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం !

-

విజయవాడ కేంద్రంగా నడుస్తున్న గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపు తప్పి రన్ వే పక్కనేవున్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులున్నారు. వారిలో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news