నా చేతిలో గంటా శ్రీనివాస్ ఓటమి ఖాయం: అవంతి శ్రీనివాస్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో విశాఖ జిల్లా భీమిలిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.దీంతో ఎవరు గెలుస్తారని నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ నాయకులు దూసుకుపోతున్నారు. పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా భీమిలిలో వైసిపి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చేతిలో గంటా శ్రీనివాస్ ఓటమి ఖాయమని తెలిపారు. భీమిలిలో దోచుకునేందుకే గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారni విమర్శించారు. అభివృద్ధి గురించి ఆయన ఏనాడు పట్టించుకోదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గంటా శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాదని, కాలం చెల్లిన మెడిసిన్ అని అవంతి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news