అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్… రూ.1500 తో 35 లక్షలని పొందండి..!

-

చాలా మంది భవిష్యత్తు కోసం సంపాదనలో కొత్త భాగాన్ని సేవింగ్స్ లో పెడుతూ వుంటారు. ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులను పెట్టాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండ పోస్ట్ ఆఫీసు అందించే ఈ స్కీమ్ వివరాలను చూడాలి.

పోస్ట్ ఆఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ నచ్చిన పధకం లో చేరి డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఏకంగా 35 లక్షలు లాభాల్ని పొందొచ్చు. ఈ స్కీమ్ పేరు పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన. ఇది భీమా పధకం. నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి దీనిలో పెట్టాల్సి వుంది. ఇలా మీరు దీని ద్వారా 35 లక్షల రూపాయలు పొందవచ్చు.

ఇందులో ఎవరు చేరచ్చు అనేది చూస్తే.. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకూ ఎవరైనా చేరచ్చు. మినిమమ్ 10 వేల రూపాయలు, మాక్సిమం 10 లక్షలు. ప్రీమియం మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి పే చెయ్యచ్చు. 30 రోజుల వ్యవధి పీమియం కట్టేందుకు ఉంటుంది. లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా వుంది. ఇన్సూరెన్స్ కూడా పొందొచ్చు.

కానీ పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాతే లోన్ వస్తుంది. ఇక ఈ స్కీమ్ తో ఎంత పొందొచ్చు అన్నది చూస్తే.. పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 1515 రూపాయలు 55 ఏళ్ల నెలవారీ ప్రీమియం. 1463 రూపాయలు 58 ఏళ్లకి, 1411 రూపాయలు 60 ఏళ్లకైతే. 31.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బెనిఫిట్ 55 ఏళ్లకు, 33.40 లక్షల రూపాయలు 58 ఏళ్లకు, 34.60 లక్షల రూపాయలు 60 ఏళ్లకు వస్తాయి. కావాలంటే మూడేళ్ల తరువాతే సరెండర్ కూడా చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news