చిత్తూరులో ఘోరం.. చలిగా ఉందని నిప్పు రాజేస్తే..!

-

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కాబావలను చూడడానికి తమ్ముడు వచ్చిన తమ్ముడు కానరాని లోకానికి పోయాడు. చలి కుంపటి వారందని ప్రమాదంలోకి నెట్టేసింది. చలిగా ఉందని వేడి కోసం కుంపటి రాజేసుకుని పడుకున్నారు పడుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక తెల్లారేసరికి ఘోరం జరిగిపోయింది.

dead
dead

 
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చలిగా ఉందని వేడి కోసం రాజేసిన కుంపటి వారి కొంపముంచింది. పొగ ఇంటిని కమ్మేసి నిద్రలోనే వారి ఉసురు తీసింది. అక్కని చూడడానికి వచ్చిన తమ్ముడిని బలి తీసుకుంది ఈ కుంపటి. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి గ్రామానికి చెందిన పురుషోత్తం, శైలజ భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు హరి ఉన్నాడు. దంపతులు అదే మండలంలోని నేలపల్లె సమీపంలో ఉన్న ఓ కోళ్లఫారంలో పని చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు.

అయితే అక్కాబావలను చూసేందుకని శైలజ తమ్ముడు రెడ్డప్ప(11) వచ్చాడు. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉందని వేడి కోసం బొగ్గు కుంపటి రాజేసి పడుకున్నారు. ఇక చలి వస్తోందని ఇంటి తలుపులు, కిటికీలు బిగించేయడంతో పొగ ఇంటిని కమ్మేసింది. నిద్రలోనే అందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుంపటి పక్కనే పడుకున్న రెడ్డప్ప ఊపిరాడక ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు.

అయితే ఉదయం ఇంటి నుంచి పొగలు రావాడని కోళ్లఫారం యజమాని గమనించాడు. వెంటనే స్థానికులతో కలసి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శైలజ, పురుషోత్తం, హరిలను 108 అంబులెన్సులో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. రెడ్డప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అక్కని చూసేందుకు వచ్చి తమ్ముడ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్రవిషాదం నింపింది. కోళ్లఫారం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news