ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని యువతి షాకింగ్ నిర్ణయం…!

-

నచ్చిన వాడితో ఎంజేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఓ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి పెద్దల పట్టింపులతో ఆగిపోవడం తో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే…మహేశ్వరం మండలానికి చెందిన చామలేటి చంద్రయ్య…లావణ్య దంపతుల కుమార్తె ప్రగతి (19) డిగ్రీ చదివి ఇంటివద్దే ఉంటోంది. కాగా యువతికి మండలం పరిధిలోని అమీర్ పేట గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది.

అయితే వీరిద్దరికీ గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పట్టింపులకు పోవడంతో నిశ్చితార్థం రద్దయింది. అయితే ప్రగతి అప్పటికే కార్తీక్ అంటే ఇష్టం పెంచుకుంది. ఇద్దరికీ ఇష్టం ఉన్నా పెద్దలు నో చెప్పడం తో ప్రగతి తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రగతి కాల్ డేటా ను పరిశీలి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news